
Israel Iran War: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు ఒకదానిపై మరొకటికి పరస్పర దాడులకు దిగుతున్నాయి. మిసైల్స్ వర్షం కురిపించుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ లోని న్యూక్లియర్ కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ దాడుల కొనసాగిస్తోంది. ప్రతిదాడిగా, కస్టర్ బాంబులతో కూడిన క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్ మీదికి ఎక్కుపెట్టింది. గత వారం రోజులుగా జరుగుతున్న దాడుల్లో ఇరాన్ కస్టర్ బాంబులను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో యుద్ధం తీవ్రత పెరిగినట్లు అర్థం అవుతోంది. ఈ దాడులకు తగిన రీతిలో సమాధానం చెప్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు.
ఇజ్రాయెల్ లోని హాస్పిటల్ పై ఇరాన్ దాడి
తాజాగా ఇరాన్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్ లోని ఓ హాస్పిటల్ ధ్వంసం అయ్యింది. ఈ ఘటనలో భవనం దెబ్బతినప్పటికీ, ఎవరూ గాయపడలేదని హాస్పిటల్ యాజమాన్యం వెల్లడించింది. అదే సమయంలో టెల్ అవీవ్ దగ్గర లోని పలు భవనాలపై దాడులు చేసింది. ఈ దాడులలో సుమారు 50 మంది గాయపడ్డారు.
ఖమేనీని ఖతం చేయాల్సిందే!
ఇరాన్ అధినేత అలీ ఖమేనీ బతకడానికి వీల్లేదని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ వెల్లడించారు. హాస్పిటల్ మీద ఇరాన్ దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. హాస్పిటల్ మీద జరిగిన దాడికి ఖమేనీ బాధ్యత వహించాలన్నారు. ఇరాన్ నియంత బంకర్ లో దాక్కొని ఇజ్రాయెల్ లోని నివాస భవనాలు, హాస్పిటల్స్ మీద దాడులు చేయిస్తున్నాడని మండిపడ్డారు. ఇవి చాలా తీవ్ర యుద్ధ నేరాలుగా ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు ఖమేనీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఖమేనీ పాలనను అంతం చేసేందుకు దాడులు ముమ్మరం చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలనను ఆయన ఆదేశించినట్లు వెల్లడించారు.
Read Also: ఇరాన్ దాడులను అడ్డుకునేందుకు.. ఇజ్రాయెల్ కు అంత ఖర్చు అవుతుందా?