
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- వైఎస్ జగన్ చంద్రబాబును ఫాలో అవుతున్నారా…? ఆయన చేతికి కనిపించిన కొత్త రింగ్ వెనుక కథేంటి…? సెంటిమెంటా…? ఆరోగ్యమా…? రాజకీయమా…? రింగ్ పెట్టుకోవడం వెనకున్న ఉద్దేశం ఏంటి…? ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
వైఎస్ జగన్ చేతి వేలికి కొత్త రింగ్.. ఎప్పుడూ లేదు… ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత… ప్రజల్లో ఉండేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు జగన్. ఓదార్పు యాత్ర, ప్రజాసంకల్పయాత్ర చేశారు. అప్పుడు ఎప్పుడూ ఈ రింగ్ కనిపించలేదు. ఇప్పుడే కొత్తగా కనిపిస్తోంది. దీంతో… ఆ రింగ్పై పెద్ద చర్చ జరుగుతోంది. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన తర్వాత.. టీడీపీ విమర్శలను తిప్పికొట్టేందుకు వైఎస్ జగన్ ప్రెస్మీట్ పెట్టారు. ఆ సమయంలో… వైఎస్ జగన్ ఎడమ చేతి మధ్య వేలికి ఆ రింగ్ కనిపించింది. చంద్రబాబు కూడా నాలుగైదేళ్ల క్రితం ఓ రింగ్ పెట్టుకున్నారు. అది హెల్త్ ట్రాకింగ్ రింగ్. చంద్రబాబులానే.. వైఎస్ జగన్ కూడా హెల్త్ ట్రాకింగ్ రింగ్ పెట్టుకున్నారని సమాచారం.
చంద్రబాబు.. తాను పెట్టుకున్న రింగ్ గురించి… చాలా సార్లు మీడియా ముందు క్లారిటీ ఇచ్చారు. ఆ రింగ్ హెల్త్ ట్రాకింగ్ రింగ్ అని… ఆ రింగ్ పెట్టుకుంటే… ఎంతసేపు నిద్రపోతున్నాము… బీసీ, గుండె వేగం అన్నీ మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. అంతేకాదు… ఎంత సేపు విశ్రాంతి తీసుకోవాలనేది కూడా ఈ రింగ్ ద్వారా తెలుస్తుదంట. అందుకే ఆ రింగ్ పెట్టుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. మరి… వైఎస్ జగన్ రింగ్ పెట్టుకుంది కూడా అందుకేనా… హెల్త్ కోసమేనా…? లేక… ఇంకేమైనా కారణాలు ఉన్నాయా…? ఉన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
వైఎస్ జగన్ కూడా ఆరోగ్యం కోసమే ఆ రింగ్ పెట్టుకున్నారని చర్చ ఎక్కువగా జరుగుతోంది. వైసీపీ ఘోర ఓటమి తర్వాత… ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో… ఆయన శ్రద్ధ చూపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు… వైఎస్ జగన్.. ఆ ఉంగరం పెట్టుకున్నప్పటి నుంచి ఆయన తీరులో మార్పు వచ్చిందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వైఎస్ జగన్ ఈ ఉంగరం గురించి స్వయంగా చెప్తేనే… స్పష్టమైన క్లారిటీ వస్తుంది. లేదంటే… ఆ ఉంగరం చుట్టూ ఇలానే ఊహాగానాలు వస్తూనే ఉంటాయి.
శత్రువును మోకాళ్లపై కూర్చోబెట్టాం, ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు!
24 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులు, స్కూల్ టీచర్ అరెస్ట్!