
డీసీపీ ఎ.భాస్కర్
మంచిర్యాల,క్రైమ్ మిర్రర్ః మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని డీసీపీ ఎ.భాస్కర్ తనిఖీ చేసి, పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.

ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత కీలకమైనదన్నారు. ప్రతి పౌరుడు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి విజ్ఞప్తి చేశారు.









