జాతీయం

భారత అమ్ములపొదిలోకి మరో అణ్వస్త్రం, అగ్ని 5 పరీక్ష విజయం

Agni 5 Missile: దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ఇంటర్‌ మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ ‘అగ్ని 5‘ పరీక్ష విజయవంతం అయింది. ఒడిశాలోని  చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి అగ్ని 5 పరీక్ష జరిగింది. ఆపరేషనల్, టెక్నికల్ పారామీటర్స్‌ ను దృష్టిలో పెట్టుకుని ఈ పరీక్ష జరిగింది. స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ ఈ పరీక్ష నిర్వహించింది. ఈ మేరకు భారత రక్షణ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. “స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరిగింది. భారత అమ్ములపొదిలోకి మరో అణ్వాయుధం వచ్చి చేరింది” వెల్లడించింది.

అగ్ని 5 ప్రత్యేకతలు

అగ్ని 5ని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అభివృద్ధి చేసింది. అగ్ని సిరీస్‌ లో అగ్ని 5 అత్యంత అత్యాధునికమైన మిస్సైల్. ఇది ఉపరితలం మీద నుంచి ఉపరితలానికి ప్రయోగించే మిస్సైల్. 5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఇది ఛేదించగలదు. అగ్ని 5 రేంజ్‌ ను మరింత పెంచడానికి డీఆర్‌డీఓ ప్రయత్నిస్తోంది. 7,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేలా మార్పులు చేయాలని చూస్తోంది. అగ్ని 5 ఒకే సారి మూడు బాంబులను పేల్చగలదు. మరోవైపు డీఆర్‌డీఓ అగ్ని 5లో కొత్త వేరియంట్లను అభివృద్ధి చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button