- కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా
- మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, క్రైమ్ మిర్రర్ : ఇంకెంతకాలం అవమనాలు భరించాలని, భవిష్యత్ ఏంటో తెలియడం లేదని సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం పై ఆలోచిస్తున్నానని తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంత వరకు తనకు వేధింపులు తప్పవన్నారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కు రాసిచ్చారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు జగిత్యాల కాంగ్రెస్ పట్టా రాసిచ్చారని ఆరోపించారు. అధినాయకత్వం కార్యకర్తల మనోభావాలను గౌరవించాలన్నారు .జగిత్యాలలో ఇలా ఉంటే పార్టీ మారిన మరో తొమ్మిది ప్రాంతాల్లో ఎలా వుందో అని అయన అన్నారు.
