
Israel-Iran War: ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ను ఇజ్రాయెల్ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అయినప్పటికీ, వాటిని అడ్డుకునేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్ వరుస దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ క్షిపణులను అడ్డుకునే సామర్థం నెమ్మదిగా తగ్గుతోంది. ఇజ్రాయెల్ ‘రైజింగ్ లయన్ ఆపరేషన్’ను మొదలుపెట్టిన నాటి నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి దూసుకెళ్లే సుమారు 400 బాలిస్టిక్ మిసైల్స్ ను ఇరాన్ ప్రయోగించింది. ఇలాంటి క్షిపణులు ఇరాన్ దగ్గర ఏకంగా 2 వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి మిసైల్స్ ను అడ్డుకునేందుకు యూరో వ్యవస్థ అడ్డుకుంటున్నా, చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.
రోజూ రూ.2400 కోట్లు ఖర్చు!
వాస్తవానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలమైనది అయినప్పటికీ, దాన్ని మెయింటెయిన్ చేయడానికి చాలా వ్యయం చేయాల్సి వస్తోంది. ఐరన్ డోమ్, డెవిడ్స్ స్లింగ్, యూరో సిస్టమ్, ప్యాట్రియట్స్, థాడ్ బ్యాటరీలతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థ వ్యయం ఆదేశాన్ని భయపెడుతోంది. వీటి కోసం ఒక్క రాత్రికి సుమారు రూ. 2,400 కోట్లు ఖర్చు అవుతున్నట్లు అంచాన. అంతేకాదు, క్షిపణులను అడ్డుకునే యూరో సిస్టమ్ ఒక్కోటి రూ. 25.94 కోట్లు ఖర్చు అవుతుంది. మరోవైపు ఇరాన్ క్షిపణుల ప్రయోగం కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ దగ్గర గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించిన నిల్వలు తగ్గుతున్నాయి. అమెరికా నుంచి వీటి సరఫరా జరగకపోతే, ఇజ్రాయెల్ దగ్గర క్షిపణులను అడ్డుకునే వ్యవస్థ మరో రెండు వారాలకు మించి ఉండదని తెలుస్తోంది. ఇప్పటికే, ఇజ్రాయెల్ దగ్గర కిపణులను అడ్డుకునే వ్యవస్థ బలహీనం అవుతోంది. ఏ క్షిపణిని అడ్డుకోవాలి అనే విషయాన్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి రానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా ఇరాన్ తో ఏదో ఒకటి తేల్చుకోవాలనే ఆలోచనలో ఇజ్రాయెల్ ఉన్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
Read Also: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. దర్యాప్తు అధికారుల ఫోకస్!