ఎల్బీనగర్,క్రైమ్ మిర్రర్:- కొత్తపేట డివిజన్ బీజేపీ కార్యాలయంలో డివిజన్ అధ్యక్షులు మంచి రాజేష్ కుమార్ జన్మదినం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొత్తపేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేష్ కుమార్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కట్టుబడి ఉన్న నాయకుడని, యువ నాయకత్వానికి మంచి ఆదర్శమని ప్రశంసించారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. ఈ వేడుకలో బీజేపీ జిల్లా నాయకులు వగ్గుల సుందర్ నారాయణ, కౌన్సిల్ మెంబర్ కాటా విజయ గౌడ్, స్వర్ణ, తిరుమల, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రామ కృష్ణ, గట్టు మహేష్ కుమార్, సాయి పాటిల్, శరణ్, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

