మంచిర్యాల, క్రైమ్ మిర్రర్ః మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మనుమాన్ ఆలయాల్లో భక్తి శ్రద్దలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోటపల్లి మండలంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు.
అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కాగా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన బొమ్మ రాజేశ్వర్ రెడ్డి, సౌడం శ్రీనివాస్కు ఆలయ కమిటి తరుపున ప్రత్యేక క`తజ్ఞతలు తెలిపారు. ఈ జయంతి వేడుకల్లో వేడుకల్లో గ్రామ సర్పంచ్ గొడిశెల్ల పోసక్క- సంజీవ రెడ్డి, ఉప సర్పంచ్ స్వప్న పున్నం చందు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
