
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- మహిళలను కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మహిళల ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం నిలబడేలా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నామని,కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే ఈ ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు..గత ప్రభుత్వం చేస్తున్న అప్పులు తీరుస్తూనే మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మహిళలకు ఇచ్చిన మాట తప్పారని కేటీఆర్ హరీష్ రావు అంటున్నారని, మాట తప్పడానికి కారణం ఎవరు ఈ రాష్ట్రం అప్పుల పాలవడానికి కారణం ఎవరు మొదట మీరు చెప్పండని ప్రశ్నించారు..రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఈరోజు మేము అనుభవిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర మొత్తం మీద చిన్నచిన్న కాంట్రాక్టర్లు ఇవ్వాల్సిన బిల్లుల అప్పులు 40 వేల కోట్లని, వీళ్ళు చేసిన అప్పులకు ప్రస్తుతం కాంట్రాక్టర్లకు బిల్లులు రాలేని పరిస్థితి నెలకొందన్నారు..కెసిఆర్ టిఆర్ఎస్ వాళ్ళు చేసిన లూటి, మోసాలు, అవినీతి అధికార దుర్వినియోగం వల్ల ఈరోజు మనం బాధపడుతున్నప్పటికీ మహిళలు ఎవరు అధైర్య పడవద్దన్నారు.. రాబోయే రోజుల్లో మహిళలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని గతంలో ఉన్న ప్రభుత్వమ్ వంద రూపాయల చీరలు ఇచ్చిందని ఇప్పుడు మహిళలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని సంతోషంగా ఉండాలని ఎనిమిది వందల రూపాయల విలువ గల చీరలు పంపిణీ చేస్తున్నామన్నారు.
Read also : Oats: మీరు టిఫిన్లో రోజూ ఓట్స్ తీసుకుంటున్నారా?
మద్యం నియంత్రణ పై మహిళల హర్షం
2014 నుండి బెల్ట్ షాపులు గ్రామాలలో విచ్చలవిడిగా తయారయ్యాయని దానికి కారణం కేసీఆర్ అని అన్నారు..మద్యపాన నిషేధానికి నేను వ్యతిరేకం కాదని, కానీ పొద్దంతా మద్యం తాగే విధానానికి వ్యతిరేకం అని మరోసారి స్పష్టం చేశారు.. ఉదయం నుండి సాయంత్రం వరకు పొద్దంతా పనిచేసుకొని సాయంత్రం పూట కొద్దిగా తాగాలే కానీ విచ్చలవిడిగా తాగొద్దని సూచించారు..ఇంటి యజమాని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యం ఉన్నప్పుడే చదువు విషయంలో ఉద్యోగ విషయంలో వ్యాపారం విషయంలో రాణిస్తారని అన్నారు..ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం నియంత్రణపై మహిళలు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుమ్మం శ్రీనివాస్ రెడ్డి ,ఆర్డీవో శ్రీదేవి, ఎంపీడీవో యుగంధర్ రెడ్డి , ఇంచార్జ్ ఎమ్మార్వో నరేష్ , మహిళా సంఘాల గ్రూపు లీడర్లు పాల్గొన్నారు.
Read also : Sex Awareness: పీరియడ్స్ టైమ్లో శృంగారంలో పాల్గొనవచ్చా?





