క్రైమ్

ఇద్దరు బాలికలపై రెండు రోజులు గ్యాంగ్ రేప్.. జనగామలో దారుణం

జనగాంలో దారుణం జరిగింది. పునరావాస కేంద్రంలో ఉన్న బాలికల పై గ్యాంగ్ రేప్ జరిగింది. పునరవాస కేంద్రం నుంచి తప్పించుకుని వెళ్లిన ఇద్దరు బాలికలపై రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్ జరిగింది. జనగాంలో ఒంటిరిగా ఉన్న బాలిక ను ట్రాప్ చేసి అత్యాచారం చేసిన పాన్ షాప్ నిర్వాహకుడు సాయిదీప్..స్నేహితుడు రాజు తో కలిసి బాలికపై అత్యాచారం చేశాడు.

జనగాంకి చెందిన బాలిక 3 నెలలుగా పునరావాస కేంద్రంలో ఉంటుంది.సెప్టెంబర్ 18న పునరావాస కేంద్రంలో చేరింది మరో బాలిక. సెప్టెంబర్ 24న బాలికల పునరావాస కేంద్రం నుంచి పారిపోయారు ఇద్దరు బాలికలు.పునరావాసం నుంచి పారిపోయి జనగాంకు చేరుకున్నారు. అక్కడి పాన్ షాప్ నిర్వాహకుడు సాయి దీప్ ఫోన్ తీసుకొని స్నేహితుడు నాగరాజుకు ఫోన్ చేసింది ఓ బాలిక. ఆశ్రయం కల్పిస్తానంటూ తీసుకెళ్లి బాలికపై అత్యాచారానికి పాల్పడాడు నాగరాజు.

Read More : రేవ్‌ పార్టీలో తప్పతాగి పడిపోయిన యువతులు!

బస్టాండ్ దగ్గర ఒంటరిగా ఉన్న మరో బాలికను గమనించి ట్రాప్ చేశాడు పాన్ షాప్ నిర్వాహకుడు సాయి దీప్. బెకరీ నిర్వాహకుడు రాజుతో కలిసి బాలిక పై అత్యాచారం చేశాడు సాయిదీప్. మరోవైపు తాను తీసుకెళ్లిన బాలికను 25న బస్టాండ్ వద్ద వదిలేశాడు నాగరాజు.ఈ బాలికను కలిసింది సాయి దీప్ వెంట వెళ్ళిన బాలిక. తర్వాత ఈ ఇద్దరు ఒంటరిగా ఉన్న బాలికలు అనే విషయం తెలుసుకున్న అఖిల్, రోహిత్.. వాళ్లిద్దరిని ట్రాప్ చేశారు.
ఇద్దరినీ హైదారాబాద్ తీసుకెళ్తాం అని నమ్మించి కారులో ఎక్కించుకుని కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. తిరిగి పునరావాస కేంద్రం వద్ద వదిలి వెళ్లారు యువకులు. జరిగిన విషయాన్ని పునరావాస అధికారులకు చెప్పారు బాలికలు. దీంతో పునరావాస కేంద్రం నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ జరిపిన పోలీసులు.. సాయిదీప్, రాజు, నాగరాజు, అఖిల్, రోహిత్ లను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులపై సైదాబాద్ పోలీసులు పోక్స్ కేసు నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button