తిరుపతి నుంచి వినుకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా తృటిలో ప్రమదం నుంచి ప్రయాణీకులు బయపడ్డారు. విన్నమాల వద్దకు చేరుకోగానే మంటలు వ్యాపించాయి. వెనుకసీటులో ఉన్న వ్యక్తి టికెట్ కోసం లేచినప్పుడు మంటను గుర్తించి తోటి ప్రయాణీకులను అప్రమత్తం చేశారు.
వెంటనే ప్రయాణీకులు బస్సు దిగిపోయారు. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.





