- బ్యాంక్ ఖాతాల సీజ్
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ః సృష్టి ఫెర్టిలిటి సరోగసి సెంటర్ కేసులో డాక్టర్ నమ్రతను, ఆమె కొడుకును ఈడీ అధికారులు అరెస్టు చేశారు. సరోగసి ముసుగులో అనేక అక్రమాలు చోటుచేసుకున్నట్లు గతంలో అనేక ఫిర్యాదులు చేశారు.
ఈకేసు విషయమై డాక్టర్ నమ్రత తప్పించుకుని పారిపోయింది. ఎట్టకేలకు అధికారులు అరెస్టు చేశారు. గిరిజనుల వద్ద బిడ్డలనుకొనుగోలు చేసి సరోగసి ద్వరాపుట్టినట్లునమ్మించి బాధితుల వద్ద నుంచి అనేక కోట్ల రూపాయలు దండుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి
కాగా ఈ దాడుల్లో 30కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎనిమిది బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కూడా చేశారా అనే కోణంలో అధికారులు దర్యప్తు చేస్తున్నారు.









