
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 20 25 లో ఎన్నో వింతలు చోటు చేసుకున్నాయి. దాదాపు 18 సంవత్సరాలుగా కప్పు నెగ్గని బెంగళూరు జట్టు ఈసారి ఐపీఎల్ 20 25 ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో 18 సంవత్సరాల ఆ కళ అనేది బెంగళూరు జట్టు నెరవేర్చుకుంది. దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన ఈ ఐపీఎల్ టోర్నమెంట్ అనేది తాజాగా ముగిసింది. ఇన్ని సంవత్సరాలుగా కప్పు నెగ్గని బెంగళూరు మరియు పంజాబ్ ఫైనల్ మ్యాచ్లో హోరాహోరీగా పోరాడుగా చివరికి బెంగళూరు జట్టు కు విజయం గురించి ట్రోఫీని ముద్దాడింది.
ఈ సీజన్లో ఎటువంటి అంచనాలు లేకపోయినా చాలా మంది యంగ్ స్టార్ క్రికెటర్స్ మంచి ప్రదర్శనను కనబరిచారు. సాయి సుదర్శన్ తన అద్భుతమైన బ్యాటింగ్ ఆటతీరుతో ఆరంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు ఐపీఎల్లో ఎంతో అనుభవజ్ఞులైన బౌలర్ సున్నా కూడా చివరికి ప్రసిద్ధి కృష్ణ అనే ఇండియన్ ఇన్ ప్లేయర్ పర్పుల్ క్యాప్ ను దక్కించుకున్నారు. మరోవైపు భారీ ధరతో కొనుగోలు చేసిన క్రికెట్ ప్లేయర్స్ రిషబ్ పంత్ మరియు వెంకటేష్ అయ్యర్ మాత్రం తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ 2025లో విఫలమైన ఆటగాళ్లతో కూడిన ప్లేయింగ్ లెవెన్ జట్టును ఓ న్యూస్ వెబ్సైట్ ప్రకటించింది. అందులో ముఖ్యంగా….
1. రచించిన రవీంద్ర
2. ఇషాన్ కిషన్
3. రిషబ్ పంత్
4. వెంకటేష్ అయ్యర్
5. గ్లెన్ మాక్సివల్
6. నితీష్ కుమార్ రెడ్డి
7. ధోని
8. రషీద్ ఖాన్
9. రవిచంద్రన్ అశ్విన్
10. మహమ్మద్ షమీ
11. దీపక్ చాహర్
చీనాబ్ రైల్వే వంతెన ప్రారంభం, నేరుగా కాశ్మీర్ కు వందేభారత్ పరుగులు!
రూ.1.50 లక్షల వరకు ట్రీట్మెంట్ ఫ్రీ, యాక్సిడెంట్ బాధితులకు కేంద్రం ఆసరా!