తెలంగాణ

భీమనపల్లి,చర్లగూడెం పాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్,పెన్నులు,పెన్సిళ్ల పంపిణీ

  • *వృధా ఖర్చు చేయకుండా సమాజసేవకు కృషి చేయండి*
  • *యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్
*క్రైమ్ మిర్రర్ మాడుగులపల్లి ప్రతినిది:* నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా వృధా ఖర్చు చేయకుండా విద్యార్థిని, విద్యార్థులకు వారికి అవసరమయ్యే సామాగ్రిని బహుపించామని యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్ అన్నారు.

 

శుక్రవారం నల్గొండ జిల్లా, మాడుగులపల్లి మండలంలోని భీమనపల్లి,చర్లగూడెం గ్రామాలలో గల ప్రాథమిక పాఠశాలలో హెడ్మాస్టర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో యువ నాయకుడు నంద్యాల శ్రీనివాస్ విద్యార్థినీ విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్లు,నోట్ బుక్స్ లను పంపిణీ చేశాడు.

 

ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ… నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా వృధా ఖర్చు చేయకుండా విద్యార్థిని, విద్యార్థులకు వారికి అవసరమయ్యే సామాగ్రిని బహుపించామని తెలిపారు, అదేవిధంగా విద్యార్థులు గురువులు బోధించే పాఠాలను విని బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. కార్యక్రమంలో నంద్యాల జానీ,రాజేష్, ప్రవీణ్,జయంత్ అభిలాష్,రాజకుమార్,పవన్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button