
కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్ పోయకూడదని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు, బంకుల్లో లేదంటే బహిరంగ ప్రదేశాల్లో పార్క్ చేసిన వాటిని గుర్తించినా వాటిని జప్తు చేస్తారు. అంతేకాదు, కాలం చెల్లిన వాహనాదారులకు జరిమానాలు కూడా విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ఫోర్ వీలర్స్ యజమానులకు రూ. 10 వేలు, టూవీర్ యజమానులకు రూ. 5 వేలు జరిమానా వేయనున్నట్లు వెల్లడించారు. జులై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
కాలం చెల్లిన వాహనాలకు నో పెట్రోల్
10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలతో పాటు 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను కాలం చెల్లిన వాహనాలుగా పరిగణించనున్నట్లు ఢిల్లీ రవాణాశాఖ అధికారులు తెలిపారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం, జులై ఒకటి నుంచి కాలం చెల్లిన వాహనాలకు ఢిల్లీలో ఫ్యుయెల్ అమ్మరు. ఆ వాహనాలు ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయినా ఈ ఆదేశాలు వర్తిస్తాయి. ఇప్పటికే కాలం చెల్లిన వాహనాలను గుర్తించేందుకు ఢిల్లీలోని సుమారు 500 పెట్రోల్ బంకుల్లో ఆటో మేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కెమెరాలు, నెంబర్ ప్లేట్ ఆధారంగా ఆ వాహనం వివరాలు తెలుసుకుని కాలం చెల్లిన వాహనాలు అయితే పెట్రోల్ లేదంటే డీజిల్ నింపకుండా అడ్డుకుంటాయి.
ఎందుకు ఈ నిర్ణయం?
ఢిల్లీలో గత కొంత కాలంగా పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోతోంది. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో రైతులు పొలాలు కోసిన తర్వాత మిగిలిన గడ్డిని తలబెట్టడం ద్వారా ఆ పొగ అంతా ఢిల్లీ చుట్టూ విస్తరించి కాలుష్యానికి కారణం అవుతుంది. అదే సమయంలో కాలం చెల్లిన వాహనాలు కూడా ఎక్కువ మొత్తంలో కాలుష్యం కలుగజేస్తున్నాయి. గత ఆప్ ప్రభుత్వం సరి, బేసి సంఖ్యల ప్రకారం వాహనాలు నడపాలని నిర్ణయించగా, ప్రస్తుత బీజేపీ సర్కారు కాలం చెల్లిన వాహనాలను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది.
Read Also: ఇక బైకులకూ టోల్ ఛార్జీ.. నితిన్ గడ్కరీ ఏం చెప్పారంటే?