Tuesday, March 10, 2026
Homeక్రైమ్Crime: కోర్టు ఆవరణలో మహిళపై గ్యాంగ్ రేప్

Crime: కోర్టు ఆవరణలో మహిళపై గ్యాంగ్ రేప్

Crime: కోర్టు ఆవరణలు సాధారణంగా బాధితుల రక్షణకు, న్యాయం సాధించడానికి, భయపెట్టే వాతావరణాలను దూరం చేసేందుకు ఉన్న ప్రదేశాలు. కానీ మహారాష్ట్రలోని థానే నగరంలో మాత్రం పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా మారింది. ఒక వివాహిత మహిళను ఆమె నమ్మిన వ్యక్తి మోసపూరితంగా తన వలలోకి దింపి, మరొకరితో కలిసి దారుణ లైంగిక దాడికి పాల్పడటం ఎంత క్రూరమో ఈ సంఘటన చెబుతోంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 25, 2024న జరిగిన ఈ సంఘటనను బాధితురాలు ఈ నెల 5న అంటే చాలా రోజుల తర్వాత ఫిర్యాదు చేయాల్సి రావడం వెనుక నిందితుల బెదిరింపుల తీవ్రత తెలుస్తోంది.

థానే ఫ్యామిలీ కోర్టు ఆవరణలో కారులో జరిగిన ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు కేదార్ బాధితురాలికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. తన పుట్టినరోజు పేరుతో ఆమెను పిలిచి, కేక్‌లో మత్తుమందు కలిపి తినిపించి, స్పృహా కోల్పోయిన సమయంలో తనతో పాటు మరో వ్యక్తిని తీసుకువచ్చి, ఇద్దరూ కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, ఈ మొత్తం దృశ్యాన్ని వీడియో రూపంలో రికార్డు చేసి, ఆ దృశ్యాలను చూపిస్తూ ఆమెను ఎప్పటికప్పుడు బెదిరించడం వల్లే బాధితురాలు చాలా కాలం మౌనం పాటించాల్సి వచ్చింది.

ఇక ఇది ఇలాగే కొనసాగుతూండటంతో బాధితురాలు చివరకు ధైర్యం చేసి తన భయాలను జయించి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితులపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు న్యాయవ్యవస్థ సెక్యూరిటీపై, కోర్టు ఆవరణాల భద్రతపై, లైంగిక దాడి బాధితులకు ఇవ్వాల్సిన రక్షణపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. మహిళలు ఎక్కువగా నమ్మకంతో, సహాయం అందిస్తారని నమ్మి వెళ్లే ప్రదేశాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతుండటం అత్యంత విచారకరం.

ALSO READ: Vikram Bhatt: రూ.30 కోట్లకు పైగా ఫ్రాడ్ కేసు.. ప్రముఖ డైరెక్టర్, ఆయన భార్య అరెస్ట్..

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు.డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు.క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments