క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైసీపీ కీలక నేత,మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు గుడ్ న్యూస్ తెలిపింది. అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 2023లో సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా పేరిట అంబటి రాంబాబు మోసం చేశారు అంటూ అతనిపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. అంబటి రాంబాబును కస్టడీ కి ఇవ్వాలి అని తెలిపిన పోలీస్ పిటిషన్ ను కోర్టు తాజాగా తిరస్కరించింది. కాగా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అసభ్యకరంగా దూషించినందుకు అలాగే పోలీస్ విధులకు ఆటంకం కలిగించినందుకు గాను పోలీసులు అతనిపై పలు కేసులు కింద అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులలో ఇప్పటికే అతనికి బెయిల్ లభించింది. కానీ ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పారుపల్లిలో తెలంగాణ జాతిపిత జన్మదినోత్సవం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం.. న్యూ అప్డేట్ ఇదే?
