- మంత్రి కోమటిరెడ్డి
నల్గోండ, క్రైం మిర్రర్ః
రాష్ట్ర ప్రజల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పని చేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నరు.
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగాఆయన 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి దండంపల్లి నాగజ్యోతి పరశురాం కి మద్దతుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల మెరుగుదల, సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిస్తే మరింత అభివృద్ది చేసి చూపెడుతామని ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.





