-
ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి
-
అవగాహన కోసం షార్ట్ ఫలిమ్స్ తీస్తా
-
క్యాన్సర్ దినోత్సవంలో చిరంజీవి
హైదరాబాద్,క్రైం మిర్రర్ః
అవగాహన కల్పించడంతోనే క్యాన్సర్కు అడ్డుకట్ట వేయవచ్చునని మెగాస్టర్ చిరంజీవి అన్నారు.
శరీరంలో వచ్చే మార్పులను గమనించాలన్నారు. ముందుగానే గుర్తిస్తే నయం చేసుకోవడానికి వీలుంటుందన్నారు.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
ప్రతి ఒక్కరు జీవనశైలిలో మార్పు చేసుకొని ఆరోగ్యకరమైన వాటినే తినాలని సూచించారు. భవిష్యత్లో క్యాన్సర్పై అవగాహన కోసం షార్ట్ ఫిలీం తీయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.
శరీరం చెప్పే మాట అందరూ వినాలి. నాకు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్యం చేయకూడదన్నారు.
మన అలవాట్లు, వాతావరణం, వంశపారంపర్యంగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. మొదటి దశలోనే దాన్ని గుర్తిస్తే 90 శాతం తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్లు వేయిస్తే కొన్నిరకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడొచ్చు.
మహిళలు కూడా జాగ్రత్తగా ఉండి వ్యాక్సిన్లు తీసుకోవాలని కోరారు.





