
బిచ్కుంద,క్రైమ్ మిర్రర్ :- కామారెడ్డి జిల్లాలో తొలి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది.బిచ్కుంద మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులలో జరిగిన ఎన్నికల్లో 10 వార్డులలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.2 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.మ్యాజిక్ ఫిగర్ ను దాటి కాంగ్రెస్ పార్టీ బిచ్కుంద మున్సిపల్ పీఠాన్ని కైవసం సేసుకుంది.దీంతో ఫలితాలు వెలువడిన వెంటనే బిచ్కుంద పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.జుక్కల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని తెలిపారు.
మలక్ పేట లో ట్రాఫిక్ సేఫ్టీ అవగాహన









