తెలంగాణ

మండలంలో కనుమరుగైన ‘పరాక్రమ దివాస్’

కనీసం నివాళులు అర్పించని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు

క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్:- నేతాజీ జయంతి జరుపుకోకపోవడం అనేది సాధారణంగా జరగని విషయం, ఎందుకంటే ఆయన దేశభక్తి, పోరాట నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మించిన రోజున అతని వారసత్వం ప్రతి సంవత్సరం ‘పరాక్రమ్ దివస్’ గా జరుపుకుంటారు. బోధనలు మరియు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉల్లేఖనాలు సంబంధితంగా ఉన్నాయి మరియు భారతీయులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అణచివేత మరియు అన్యాయంపై పోరాడుతున్న ప్రజలకు స్ఫూర్తినిస్తాయి. కానీ అలాంటి మహోన్నత వ్యక్తి జ్ఞాపకాలు నేడు ప్రజల్లో కనుమార్గౌతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే…మహాదేవపూర్ మండలంలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కనీసం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కుడా స్వాతంత్ర సమరయోధుడి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించలేదు, ఆనాటి స్వాతంత్ర సమరయోధుడి సేవలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా పరిగణించబడుతుంది. కానీ అలాంటి మహోన్నత వ్యక్తి జ్ఞాపకాలు నేడు మహాదేవుపూర్ మండలంలో కనుమరుగయ్యాయి. ఏది ఏమైనా ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం.

తల్లి చేతులో ఉన్న బిడ్డను లాక్కెళ్లి బావిలో పడేసిన కోతి.. రక్షించిన డైపర్!

ప్రియురాలు దూరం పెట్టిందని.. ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button