రాయిపూర్, క్రైమ్ మిర్రర్:టెకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు సిబ్బందతో పాటు ఏడుగురు మృతి చెందారు. ప్రమాదానికి గురైంది రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ సి 90 విమానం గా గుర్తించారు.
సాయంత్రం 7:11 నిమిషాలకు రాంచీ నుంచి రోగితో ఢిల్లీ కి విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన తర్వాత కోల్కతా కమ్యూనికేషన్ సెంటర్ తో ఎయిర్ అంబులెన్స్ సిబ్బంది మాట్లాడారు. వాతావరణ కారణాల వల్ల దిశను మార్చాలని కోరారు. 7:34 నిమిషాలకు కమ్యూనికేషన్ సెంటర్ తో సంబంధం తెగిపోయింది.

