క్రైమ్ మిర్రర్,హన్మకొండ:- చికెన్ సెంటర్లలో కోడి మాంసాన్ని శుభ్రం చేసేటప్పుడు పసుపుకు బదులుగా కృత్రిమ రంగులు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హన్మకొండ ఫుడ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మాజీ హెచ్చరించారు. ఆదివారం వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి చక్రపాణితో కలిసి ఆయన పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన రంగులు కలిపిన మాంసం తింటే ఉదర, పేగు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని, అలాంటి విక్రయలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
సీబీఎస్సీ బోర్డు పరీక్షలు వాయిదా?.. క్లారిటీ
Telangana: హౌస్ లిస్టింగ్కు రంగం సిద్ధం.. మే 11 నుంచి జూన్ 9 వరకు జనగణన తొలి దశ
