ఆంధ్ర ప్రదేశ్తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డితో నారా బ్రాహ్మణి స్పెషల్ మీటింగ్

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన జరిగింది. తెలంగాణ సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు తళుక్కున మెరిసింది. నారా బ్రాహ్మణి తెలంగాణ సచివాలయం రావడమే స్పెషల్ కాగా.. సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరై మరింత ఆశ్చర్యపరిచింది. సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో నారా బ్రాహ్మణే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, వర్సిటీ విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభంపై చర్చించి కీలక నిర్ణయాలు ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు హాజరయ్యారు.స్కిల్ యూనివర్శిటీ సమావేశానికి పలువురు పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం ఆహ్వానించింది. హెరిటేజ్ సంస్థ ప్రతినిధిగా బ్రాహ్మణి హాజరైంది. స్కిల్ యూనివర్శిటీ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని సీఎం రేవంత్ రెడ్డితో నారా బ్రహ్మణి చెప్పారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచే తరగతుల నిర్వహణ ప్రారంభిసుందని ఇప్పటికే సీఎం ప్రకటించారు. ఈ స్కిల్ వర్సిటీలో మొత్తం 20 కోర్సులు ప్రారంభించాలని భావించినప్పటికి.. ఈసారి 6 కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి కావడానికి సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలికగా ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా లేక న్యాక్ లేదా నిథమ్‌లో స్కిల్ యూనివర్సిటీని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై నేటీ సమావేశంలో చర్చించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button