తెలంగాణ

మంత్రి పొంగులేటి ఇంట్లో నోట్ల కట్టలు.. ఈడీ అధికారులు షాక్!

తెలంగాణ రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు సంచలనంగా మారాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 ఈడీ బృందాలు ఏకకాలంలో పొంగులేటికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నాయి. జూబ్లీహిల్స్ నివాసంతో పాటు హిమాయత్ సాగర్ లో ఉన్న ఇంట్లోనూ ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. ఈడీ తనిఖీల్లో మంత్రి పొంగులేటి నివాసంలో భారీగా డబ్బులు దొరికాయని తెలుస్తోంది. పొంగులేటి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలను చూసి ఈడీ అధికారులే షాకయ్యారని చెబుతున్నారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాలంలో దొరికిన నోట్ల కట్టలను లెక్కించడానికి ఈడీ అధికారులు రెండు మనీ కౌంటింగ్ మెషిన్లను తెప్పించుకున్నారు. మొదట ఓ మెషిన్ ను తీసుకెళ్లారు..సరిపోవడం లేదని రెండోది లోపలికి తీసుకెళ్లారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు పట్టుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ గ్రూపును నడుపుతున్న పొంగులేటి ముందస్తు పన్ను చెల్లింపుల్లో భారీ అవకతవకలకు పాల్పడినట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఈడీ అధికారులకు స్పష్టమైన సమాచారం అందడంతో సోదాలు చేస్తున్నారని అంటున్నారు. రూ. 650 కోట్ల TDS స్కాంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబం ఉందని తెలుస్తోంది. మూడు బోగస్ కంపెనీల ద్వారా టీడీఎస్లో అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ గుర్తించింది. ఆరునెలల క్రితం ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడి .మొత్తం పొంగులేటి కుటుంబసభ్యుల నివాసాలలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.

Read More : కొత్తపేట విక్టోరియా మెమోరియల్ స్కూల్‌లో ఏసీబీ రైడ్స్ 

తెలంగాణలో పొంగులేటి మంత్రి కావడంతో..హైదరాబాద్ లో ఉన్న ఈడీ అధికారులకు కూడా సమాచారం లేకుండా కేంద్ర బలగాలతో సహా ఢిల్లీ నుంచి వచ్చి తనిఖీలు చేపట్టారు.పొంగులేటి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి సోదాలు అంతర్గతంగా జరిగిపోతాయి. ఈడీ నేరుగా తాము ఫలానా వారిపై దాడులు చేశామని కూడా చెప్పదు. అయితే హైదరాబాద్‌లో దాడులు చేశామని ఇంత నగదు స్వాధీనం చేసుకున్నాం.. ఇన్ని అక్రమాలను గుర్తించామని మాత్రం ప్రకటిస్తూంటారు. దాన్ని బట్టి ఎంత దొరికిందని తేలే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button