
సమాజం పూర్తిగా భ్రష్టుప్టటి పోతోంది. కామంతో కళ్లు మూసుకుని ఘోరాలకు పాల్పడుతున్నారు. సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కన్నవాళ్లను కడతేర్చుతున్నారు. ఇటీవల కాలంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ దారుణాలకు తెగబడుతుతున్నారు. ప్రియుడి కోసం హత్యలు చేస్తున్నారు. కన్నపిల్లలను.. కన్నవారిని చంపేస్తున్నారు. మేడ్చల్ లో జిల్లాలో తాజాగా జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పదవి తరగతి చదువుతున్న బాలిక.. లవర్ కోసం కన్న తల్లిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది.
ప్రియుడితో కలిసి కన్నతల్లిని 10వ తరగతి చదువుతున్న మైనర్ కూతురు హత్య చేసిన దారుణ ఘటన మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసింది కూతురు. ప్రేమ వ్యవహారంలో మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18)తో కలిసి తల్లి కిరాతకంగా మర్డర్ చేసింది కన్న కూతురు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములు ఇద్దరితోనూ బాలిక అక్రమ సంబంధం కొనసాగిస్తుందని తెలుస్తోంది.