తెలంగాణ

తెలంగాణలో అభివృద్ధి శూన్యం!..కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

చండూరు, క్రైమ్ మిర్రర్:-కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఒక్క రూపాయి అభివృద్ధి జరగలేదని, కానీ ప్రశ్నించిన వారిపై వందలాది కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ మాత్రమే పని చేస్తుందని మాజీమంత్రి ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. నల్లగొండ జిల్లా చండూరులో గురువారం మీడియా సమావేవంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రశ్నించన వారిపై అనేక అక్రమ కేసులు పెడుతుంది. చండూరు మున్సిపల్ చైర్మన్ దుకాణ నిర్మాణాన్ని కూల్చి వేశారు. ఇలా కేసులు పెట్టి భయపెట్టి ఓట్లు వేయించుకుందాం అనుకుంటున్నారని మండిపడ్డారు. పనులు లేక బీఆర్‌ఎస్‌ చేసిన పనులకే కొత్తగా బోర్డులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొత్తగా తెచ్చి వేసిన రోడ్డు లేదు.
వ్యవసాయరంగం పూర్తిగా నిర్లక్ష్యం అయిందన్నారు. తెలంగాణ వచ్చే నాటికి నల్లగొండ అఖరులో ఉంటే..కెసిఆర్ పాలనలో అగ్రస్థానం లో నిలిచిందని గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చేశా. కానీ మళ్లీ కాంగ్రెస్ పాలనలో నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా వస్తున్నాయని ఆరోపించారు. నిన్నటి రివ్యూ మీటింగ్ లో వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. ఇదేం సమీక్షా అని. మంత్రులు మాత్రమే మాట్లాడితే మేం ఎందుకు అని ఎమ్మెల్యేలు అనుకుంటున్నారన్నారు. కొంత మంది ప్రజా ప్రతినిధులు పోలీసల నుంచి మామూళ్లు తీసుకోవడం దురదృష్టకరమన్నారు. ఉత్తమ్‌ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖ లపై అవగాహన లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రిచెస్ట్ పార్టీ ఏదో మీకు తెలుసా?.. సర్వేలో సంచలన విషయాలు!

కృష్ణా నదితో పాటు గోదావరి జాలలను సైతం ఆంధ్రకు అప్ప జెపుతున్నారు. సీఎం, మంత్రులు కెసిఆర్‌ను తిట్టడంలోనే పోటీ పడుతున్నారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలపై, కార్యకర్తలపై అక్రమకేసులు పెడుతున్నారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సమస్యలపై ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ దుర్మార్గలకు చెక్ పెట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఇవ్వాళ చండూరులో జరుగుతున్న పనులన్నీ బీఆర్‌ఎస్ సర్కార్‌ ఇచ్చినవే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చందుకు మేము ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ పనులు మంజూరు ఇచ్చాము. మునుగోడులో ఇప్పుడు అక్కడక్కడా జరుగుతున్న పనులన్నీ కెసిఆర్‌ హయాంలోనివేనని స్పష్టం చేశారు. కమీషన్స్ కోసం బిల్లులు ఆపడం కాంగ్రెస్ నేతలకే చెల్లిందన్నారు.మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, పార్టీ నేతలు పాల్వాయి స్రవంతి, రెగట్టే మల్లికార్జున రెడ్డి, మాజీ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, మండల,పట్టణ పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న, కొత్త పాటి సతీష్, మాజీ కౌన్సిలర్లు కోడి వెంకన్న, గుంటి వెంకటేశం, యువజన విభాగం అధ్యక్షుడు ఉజ్జిని అనిల్ రావు, పెండ్యాల గీత, తదితరులు పాల్గొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ది రిచెస్ట్ పార్టీ ఏదో మీకు తెలుసా?.. సర్వేలో సంచలన విషయాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button