
క్రైమ్ మిర్రర్, న్యూస్:- అహ్మదాబాద్ లో నిన్న ఘోరమైన విమాన ప్రమాదం జరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన విమానం కేవలం రెండే రెండు నిమిషాల్లోనే కూలిపోయి ఘోర ప్రమాదం జరిగింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో మంటలతో నల్లటి పొగ ఆకాశానికి ఎగసి పడింది. ఈ ఘటనలు భాగంగా ఏకంగా 265 మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అందులో 229 మంది సామాన్య ప్రయాణికులు , ఇద్దరు పైలెట్లు, 12 మంది సహాయక సిబ్బంది వీరితో పాటుగా విమానం మెడికల్ కాలేజ్ హాస్టల్ మీద పడడంతో… అక్కడ 24 మంది విద్యార్థులు మృతి చెందారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడడం జరిగింది.
అయితే ఈ విషాద ప్రమాదం గురించి యావత్ భారతదేశం అంతటా కూడా మాట్లాడుకుంటున్న సమయంలో భారత స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు స్పందించారు. ఈ సంఘటన షాక్ అయ్యానని విరాట్ కోహ్లీ తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం వార్త విని నేను కూడా పూర్తిగా షాక్ అయ్యానని.. బాధితుల కుటుంబాల కోసం నేను ప్రార్థిస్తున్నాను అని.. చనిపోయిన కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నానని సోషల్ మీడియా వేదికగా రాసుకు వచ్చారు. కాగా మరణించిన ప్రతి ఒక్కరికి కూడా అహ్మదాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఇప్పటికే ప్రకటించారు. అలాగే టాటా కంపెనీ కూడా మృతి చెందిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఏది ఏమైనా కూడా విమాన ప్రమాదంలో ఇంత మంది మృతి చెందడం ప్రతి ఒక్కరిని కూడా కలచివేసింది.
<a href=”https://crimemirror.com/6-star-cricketers-retirement-in-only-30-days/”>30 రోజుల వ్యవధిలోనే ఆరుగురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్!..