క్రైమ్ మిర్రర్, వేములపల్లి ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఎలికట్టి శ్రావణి అన్నారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
నేటి కాలంలో మహిళలు విద్య, ఉపాధి, రాజకీయాలు, వ్యాపారం వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని తెలిపారు. మహిళలు ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళల సాధికారత కోసం ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
