
ఫోన్ ట్యాపింగ్ కేసు… తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఈ కేసు ఇప్పుడు కీలకం మారనుంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు.. సిట్ విచారణకు హాజరుకాబోతున్నాడు. 14నెలలుగా అమెరికాలో ఉంటున్న ఆయన… సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇండియాకు తిరిగివస్తున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని హామీ పత్రం కూడా ఇచ్చారు. పాస్పోర్ట్ అందిన మూడు రోజుల్లో దేశానికి తిరిగి రావాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో వన్ టైమ్ ఎంట్రీ పాస్పోర్ట్ జారీ అయిన వెంటనే ఆయన ఇండియా బయల్దేరుతారు.
గత ప్రభుత్వ హయాంలో SIB కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని 2024, మార్చి 10న కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావే. ఈనెల 5న ఆయన విచారణకు హాజరవుతుండటంతో… అతన్ని ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రశ్నలు సిద్ధం చేసుకుంటున్నారు. ట్యాపింగ్ కేసులో సూత్రధారులు ఎవరనేది రాబట్టాలని సిట్ అధికారులు ఎదురుచూస్తున్నారు. అలాగే… పోలీసు అధికారులు- శ్రవణ్రావు మధ్య లింక్ ఎలా కుదిరింది..? ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు..? ఆ సమాచారాన్ని ఎవరెవరికి ఇచ్చారని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభాకర్రావు వారి పేర్లను బయటపెడతారా…? లేదా అన్నదే సస్పెన్స్.
సిట్ అధికారులు కూడా అంత ఈజీ వదిలిపెట్టరు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ల ఆధారంగానే ప్రభాకర్రావు ప్రధాన నిందితుడని తేల్చారు. ఇప్పుడు.. వారి ఇచ్చిన స్టేట్మెంట్లను ప్రభాకర్రావును ప్రశ్నించే అవకాశం ఉంది. పైగా… ఈ కేసులో కొన్ని కీలక ఆధారాలు కూడా సిట్ దగ్గర ఉన్నట్టు సమాచారం. వాటి గురించి కూడా ప్రభాకర్తో చెప్పించాలని ప్రయత్నించబోతున్నారు. అయితే.. ప్రభాకర్రావు నిజాలు చెప్తారా..? లేదా దాటవేస్తారా అన్నది చూడాలి. మరోవైపు.. ఈనెల 5నే ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరుకాబోతున్నారు. అదే రోజు కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరుకావాల్సింది ఉంది. ఈ క్రమంలో… ఆ రోజు ఏం జరగబోతోంది..? అన్న ఉత్కంఠ అందరిలో ఉంది.