ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. అధికారుల కీలక సూచనలు!

Rains: రుతు పవనాలు ముందుగానే వచ్చినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో వానలు కురవడం లేదు. ముందుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టిన అన్నదాతలు.. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మెట్ట పంటలు ఎండకు వాడు పట్టడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా 5 రోజులు వర్షాలు

రాబోయే 5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయన్నారు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్, హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపారు. ఈ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?

జూన్ 21న ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్ పరిసర జిల్లల్లో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఏపీలో ఎక్కడ వానలు పడే అవకాశం ఉందంటే?

అటు ఆంధ్ర ప్రదేశ్ లోనే పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అల్లూరి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.  వర్షాల నేపథ్యంలో రైతులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలన్నారు. వానలు కురిసే సమయంలో ఇళ్ల దగ్గరే ఉండటం మంచిదన్నారు.

Read Also: ఆ మార్గాలన్నీ నో ప్లైయింగ్ జోన్ లోకి.. అమర్ నాథ్ యాత్రకు భద్రత్త కట్టుదిట్టం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button