-
75శాతంపైగా గెలుస్తాం
-
మంత్రి దామోదర రాజనర్సింహా
షాద్ నగర్, క్రైం మిర్రర్ః తెలంగాణలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం మాదేని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు
. 14వ వార్డు అభ్యర్థి అందె మోహన్ తరుపున షాద్నగర్లో ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని స్థానిక భవాని మాత ఆలయం వద్ద రచ్చబండ ఏర్పాటు చేసి మహిళలతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికల్లో 75శాతంకు పైగా గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమమే గెలుపిస్తుందన్నారు.
అమ్మ బాగున్నారా.. మా పాలన ఎలా ఉంది … పథకాలుఅందుతున్నాయా అంటూ ఓటర్లను పలకరించారు. తమ అభ్యర్థి అందెమోహన్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.





