Homeఆంధ్ర ప్రదేశ్అన్నదానానికి మరో భోజనశాల.. టీటీడీ కీలక నిర్ణయం!

అన్నదానానికి మరో భోజనశాల.. టీటీడీ కీలక నిర్ణయం!

TTD New Dining Hall: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. రోజూ సుమారు 60 నుంచి 80 వేల వరకు భక్తులు వేంకటేశ్వరుడిని దర్శనం చేసుకుంటారు. రద్దీ సమయాల్లో ఆ సంఖ్య మరింత ఎక్కువగానూ ఉంటుంది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తులు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో ఉచిత భోజనాన్ని తినకుండా వెళ్లరు. రోజూ ఇక్కడ వేలాది మంది భక్తులకు భోజనాన్ని అందిస్తారు. తాజాగా ఈ భోజనశాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అందేంటంటే..

అన్నదానానికి మరో భోజనశాల!

ప్రస్తుతం తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి అనుబంధంగా విశాలమైన మరొక భవనాన్ని నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. ప్రస్తుతం ఒకేసారి 4 వేల మంది భోజనం చేసేలా నాలుగు డైనింగ్‌ హాళ్లు అన్నప్రసాద కేంద్రంలో ఉన్నాయి. రోజుకు 70 నుంచి 75 వేల మంది భక్తులు ఇక్కడ భోజనం చేస్తుంటారు. రద్దీ రోజుల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. ఇటువంటి సమయాల్లో ఈ కేంద్రం వద్ద భారీగా క్యూ లైన్లు ఉంటున్నాయి. దీంతో వెయ్యి మంది ఒకేసారి భోజనం చేసేలా మరొక హాలు అవసరమని టీటీడీ అధికారులు అంచనా వేశారు. వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి సమీపంలోని గ్యాస్‌ ప్లాంట్‌ను గోగర్భం డ్యాం దగ్గరికి తరలిస్తున్నందున, ఈ ప్రదేశంలో కొత్త భవనం నిర్మించాలని నిర్ణయించినట్టు తెలిసింది. టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అన్నప్రసాద విభాగం అధికారులతో  కలిసి తాజాగా కొత్త భోజనశాల నిర్మాణ ప్రదేశాలన్ని పరిశీలించారు.

Read Also: పిఠాపురంలో ఉప్పాడ గోడ చిచ్చు – టీడీపీ, జనసేన మధ్య నలిగిపోతున్న అధికారులు

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments