
క్రైమ్ మిర్రర్, చండూరు:- నల్లగొండ జిల్లా చండూరు మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ గ ఎంపికైన (దుబ్బగూడెం) ఉడుతలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు.400 చదరపు అడుగుల నుండి 600 చదరపు అడుగుల లోపు ఇంటి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.ఇల్లు మంజూరై ఇప్పటి వరకు ప్రారంభించని వారు వెంటనే ఇంటి నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్ కుమార్, చండూరు ఆర్డీవో రమణారెడ్డి, ఎమ్మార్వో కిరణ్మయి, ఎంపీడీవో యాదగిరి గారు , ఎంపీవో మాధవరెడ్డి, హౌసింగ్ ఏఈ ఈశ్వర్ ,చండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కోరిమి ఓంకారం ,మార్కెట్ కమిటీ డైరక్టర్ భూతరాజ ఆంజనేయులు, పంచాయితీ కార్యదర్శి శంకర్ తదితరులు పాల్గొన్నారు.