
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ : సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో ఓ నర్సు ఓ రోగికి తన వక్షోజాలు చూపిస్తున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆసుపత్రిలో ఓ రోగి ముందు నిలబడి, చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత, నర్సు తన బట్టలు విప్పి వక్షోజాలు ప్రదర్శించిన ఘటన వీడియోలో కనిపిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర స్పందన వ్యక్తమవుతోంది. వీడియోలో ఉన్న దృశ్యాలను పరిశీలిస్తే, ఇది ఓ ప్రైవేట్ క్లినిక్ లేదా చిన్న ఆసుపత్రిలో జరిగిన ఘటనగా అనుమానిస్తున్నారు. అయితే ఇది ఎక్కడ జరిగిందో, ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియదు. వీడియోలోని నర్సు ప్రస్తుతం గుర్తుపట్టలేదు. కానీ ఈ వీడియోపై విచారణ జరపాలన్న డిమాండ్లు తలెత్తుతున్నాయి.
వైరల్ వీడియోపై స్పందించిన నర్సు, “ఆ రోగి తీవ్రమైన మానసిక వేదనలో ఉన్నాడు. అతడు బ్రతకాలని ఆశ వదిలేశాడు. అతని మనోభావాలను మారుస్తేనే అతను బతకగలడని అనిపించింది. అందుకే చికిత్సలో భాగంగా ఇలా చేశాను. ఇదంతా రోగి పునరుద్ధరణ కోసమే” అంటూ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Also Read : తప్పిపోయిన పిల్ల ఏనుగు.. తల్లి వద్దకు చేరేందుకు పేడ పూయాలి!
ఈ చర్యపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు స్పందించారు. ఇది అసభ్యకరమైన చర్యగా కొందరు విమర్శిస్తుండగా, మరికొందరు మానసిక చికిత్సలలో విభిన్నమైన పద్ధతులు ఉంటాయని పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ చర్య తగినదేనా? నైతికంగా సమర్థనీయమా? అన్న ప్రశ్నలు వేడెక్కిస్తున్నాయి. వైద్య సంఘాల స్పందన కోరుతూ… ఇప్పటికే ఈ ఘటనపై వైద్య నిబంధనలను పర్యవేక్షించే కొన్ని సంస్థలు స్పందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇలాంటి చర్యలు చికిత్స పద్ధతిలో అనుమతించబడినవా? లేదా నైతికంగా తప్పిదమా? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.