క్రీడలు

ప్రారంభమైన ఫైనల్ మ్యాచ్.. గెలుపు ఎవరిది?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- U19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మరి కొద్ది నిమిషాల్లోనే ప్రారంభం కానుంది. భారత్ మరియు పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అర్హత సాధించాయి. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే పాకిస్తాన్ మరియు భారత్ మధ్య ఒక మ్యాచ్ జరగగా అందులో భారత్ పాకిస్తాన్ ను మట్టికరిపించి నేడు మరోసారి ఫైనల్ లో కూడా అదే విధంగా చేసి కప్పు గెలవాలి అని పట్టుదలతో ఉంది. మరోవైపు ఉపాకిస్తాన్ ఒకే ఒక మ్యాచ్ తప్ప మిగతా అన్ని మ్యాచ్ల్లోనూ కూడా విజయాలు సాధించి ఫైనల్ వరకు చేరుకుంది. దీంతో ఇరువురి మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. 10:30కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా సోనీ స్పోర్ట్స్ మరియు సోనీ లీవ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు. ఇక హాట్స్టార్ లో లైవ్ పొందవచ్చు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్లో భారత్ జట్టు తరుపున సూర్యవంశి అలాగే అభిజ్ఞాన్ మరియు అరోన్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ లో కూడా మంచి ప్రదర్శన కనబరిచే ప్లేయర్లు ఉన్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Read also : గాయత్రినగర్ డివిజన్ లో మస్తాన్ రెడ్డి జోరు.. గెలుపు ఖాయమంటున్న సర్వేలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button