Monday, March 2, 2026
Homeతెలంగాణఅవమానానికి శరణు తీసుకున్న అందాల రాణి – పోటీని మధ్యలోనే విడిచిన మిస్ ఇంగ్లాండ్

అవమానానికి శరణు తీసుకున్న అందాల రాణి – పోటీని మధ్యలోనే విడిచిన మిస్ ఇంగ్లాండ్

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ అందాల పోటీలో ఓ వివాదం ఉత్కంఠ కలిగిస్తోంది. మిస్ వరల్డ్ 2025 పోటీలో పాల్గొనడానికి వచ్చిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ, నిర్వహణ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోటీ నుంచి మధ్యలోనే నిష్క్రమించారు. ఆమె మాటల్లో చెప్పాలంటే — “నన్ను గౌరవించలేదు. అక్కడి పరిస్థితులు చూస్తే, మమ్మల్ని ప్రదర్శన వస్తువుల్లా, ముడిపట్టి చూపిస్తున్నారన్న అనుభూతి కలిగింది. ఈ పోటీ అంతా నైతిక స్ధాయిని కోల్పోయింది.”

ఆమె ఆరోపణల ప్రకారం, పోటీ సందర్భంగా ధనవంతుల ముందు పాల్గొనేవారి చౌకగా ప్రదర్శన జరిగింది. “ఇది సామాజిక మార్పు కోసం కాదని, కేవలం అందం పేరుతో జరిగిన ఆరబోతే” అని మిల్లా వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలతో పోటీ నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు పోటీ నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ఈ తరహా ఈవెంట్‌లు ఇక జరగకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు. మిల్లా మాగీ స్పందన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజమైతే, ఇది అందాల పోటీల మౌలిక లక్ష్యాల పట్ల గంభీరమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments