ఆంధ్ర ప్రదేశ్రాజకీయం

ఏడాది పూర్తి చేసుకున్న కూటమి… తప్పు, ఒప్పులు… ప్రజల అభిప్రాయాలు ఇవే?

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి కూటమిగా ఎన్నికలలో పోటీ చేసి సరిగ్గా ఇదే రోజు అంటే జూన్ 2024లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ మెజారిటీతో కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సరిగ్గా ఈరోజుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. దీంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న పనితీరు ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది. గతంలో లాగా ఉండకుండా పూర్తిగా మారిపోయారు. మొదటినుంచి చంద్రబాబు తీరు తెలిసినవారు చంద్రబాబు నాయుడు ఏంటి ఇలా మారిపోయారు… చాలా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది అని అంటున్నారు. ఆయన ముఖంలో ఫీలింగ్స్ కనపడకుండా పూర్తిగా రాజకీయ అనుపమంత ఉపయోగించి వీలైనంత ఎక్కువగా నవ్వుతూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్రంలోని ప్రతి సామాన్య కార్యకర్తతో కూడా కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనే ఆర్భాటం లేకుండా సామాన్య మానవుడిలా ఉండాలని ప్రయత్నం చేస్తున్నారు. సామాన్య ప్రజలకు నేను వచ్చే సమయంలో ట్రాఫిక్ సమస్యలు కలగకుండా ఉండాలని.. ఎక్కడ పార్టీ సభ జరిగిన ఊరికి లేదా సిటీకి ఎక్కువ దూరంలో సభలను నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా జరిగిన మహానాడు కార్యక్రమం కూడా కడప నగరంలోని ఊరికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.

భవిష్యత్తు లోకేష్ చేతిలోనేనా ?

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి రాజకీయం మొత్తం కూడా నారా లోకేష్ చుట్టూనే తిరుగుతుంది. ఇప్పుడు ఏ చిన్న పని కావాలన్నా నారా లోకేష్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా వెళ్తున్నారు. అటు పార్టీ లోను ఇటు పవర్ లోను కూడా నారా లోకేష్ తీవ్రస్థాయిలో తన టీం ని పట్టు బిగిస్తున్నాడు. ఇక తన తండ్రి చంద్రబాబు నాయుడు కూడా నారా లోకేష్ ని పూర్తిస్థాయి రాజకీయ భవిష్యత్తు నాయకుడిగా ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. ఈ విషయం ఢిల్లీలోని బిజెపి నాయకత్వంకు కూడా అర్థమయింది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా నారా లోకేష్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు.

పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తన ప్రాధాన్యత అనేది ఎలా ఉంటుందో ప్రజలకు నిరూపిస్తున్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను అభివృద్ధి చేయడంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇక రాజకీయపరంగా పూర్తిస్థాయిలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ ప్రతిచోట కూడా వివరిస్తూనే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తమిళనాడు రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ తన ప్రభావాన్ని చూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దాదాపు 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం ఇలానే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ హామీ చేశారు.

కూటమి ప్రభుత్వం రాకతో పూర్తిగా మారిన అమరావతి

ఇక కేంద్రంలో కూటమి ప్రభుత్వం కీలకంగా మారడంతో రాష్ట్ర రాజధాని అమరావతికి బాగానే ఫండ్స్ అనేవి వస్తున్నాయి. గత ఐదేళ్లలో ఒక పాడుబడిన అడవిలా మారిన రాజధాని కి ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది. అమరావతికి భారీగానే టెండర్లు కూడా వస్తూ ఉండడంతో… కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిందని చెప్పాలి. మరోవైపు పోలవరం కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి చోట కూడా రోడ్లు మరమ్మతులు భారీగా జరుగుతున్నాయి. అధికారంలోకి రాగానే మొత్తం రోడ్లన్నీ కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం నమ్మకముతో దాదాపు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. గత ఐదేళ్లలో స్వేచ్ఛ లేని ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని కూటమి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ప్రజలపై వేధింపులు కూడా పూర్తిగా తగ్గాయని హోటల్ ప్రభుత్వం చెప్తుంది.

కూటమిలో మైనస్ లు ఇవే?
ఈ ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వంపై చాలానే విమర్శలు కూడా వెలుగోడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అభివృద్ధి కంటే… ఎక్కువగా చాలా మంది నాయకులను హింసిస్తున్నారని మాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా నారా లోకేష్ రెడ్డి బుక్ పై చాలామంది ప్రతిపక్ష పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థ తొలగించిన తరువాత ఆ స్థానంలో చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదని చాలామంది ఎగసిపడుతున్నారు. అలాగే కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీటిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గంజాయి, నేరాలు కూడా కూటమి పాలనలో తగ్గినట్టు కనిపించడం లేదని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇక ఎలక్షన్లో సమయంలో ఇచ్చిన హామీలను కూడా తొందరగా నెరవేర్చాలని ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి …

  1. ‘జియో హాట్ స్టార్’ ద్వారా అంబానీ సంపాదన మామూలుగా లేదుగా!.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

  2. ఓటమి వెనుక అసలు కారణం ఇదే!.. శ్రేయస్ అయ్యర్ సంచలన కామెంట్స్

  3. Rains: తెలంగాణలోవర్షాలు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష!

  4. ప్రపంచంలో అత్యంత పేద దేశాలు.. తిండిలేక ప్రజల అరిగోస!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button