
అమరావతి బ్యూరో, క్రైమ్ మిర్రర్ : మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కేరళలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన పై కేసు నమోదు అవ్వడం తర్వాత విచారణకు హాజరు కాకపోవడం నేపథ్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజా సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లాలో చోటు చేసుకున్న భారీ అకౌ మైనింగ్ వ్యవహారంలో కాకాని మరో నలుగురుల్లో ఏ4 నిందితుడుగా ఒకరుగా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆయనపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ కాగా పోలీసుల విచారణకు హాజరు కాకపోవడంతో ప్రత్యేక బృందం కేరళ వెళ్లి ఆయనను అరెస్టు చేసినట్టు తెలుస్తుంది.
మాజీ మంత్రి అరెస్టు రాజకీయ వర్గాల సంక్షేనా రేపుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఎన్నికల ఓటమితో సత్వ కోల్పోయిన నేతల మధ్య ఈ అరెస్టు మరింత కలకలం రేపే అవకాశం ఉంది. కాకాని గతంలో మంత్రిగా వ్యవహరిస్తూ పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
నెల్లూరు జిల్లాలో కొన్ని వేల కోట్ల విలువైన మట్టిని అక్రమంగా తవ్వకాలు చేసి తరలించిన ఘటనపై ఇటీవల కాలంలో దర్యాప్తు ముమ్మరమైంది. ఈ కేసులో రాజకీయ నాయకులు ప్రభుత్వం అధికారులు ప్రైవేట్ సంస్థల ప్రమాణం ఉన్నట్లుగా ఆధారాలు లభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అదనపు దర్యాప్తు కొనసాగుతుంది కాకాని అరెస్టును పోలీసులు దృవీకరించగా ఆయన నెల్లూరుకు రిమాండ్ మీద తరలించే ఏర్పాట్లుగా జరుగుతున్నాయి. ఈ కేసులో మరో మారు పలు కీలక వ్యక్తుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.