క్రీడలు

పక్షిలా గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్న మన తెలుగు ఆల్రౌండర్!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- భారత్ మరియు వెస్టిండీస్ మధ్య అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ తొలి టెస్ట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ లతో పాటు బౌలర్లు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. మొదటి టెస్టులో భాగంగా ఇండియన్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి కళ్ళు చెదిరేటువంటి క్యాచ్ను పట్టుకున్నారు. రెండో ఇన్నింగ్స్ లో సిరాజ్ బౌలింగ్లో… వెస్టిండీస్ టీం ఓపెనర్ చందర్ పాల్ కొట్టిన బంతిని స్క్వేర్ లెగ్ లో ఒక పక్షిలా గాల్లోకి ఎగిరి క్యాచ్ను పట్టుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. తెలుగు ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి పట్టిన క్యాచ్ ను చూసిన క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపోవడంతో పాటు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి క్యాచ్లు పట్టడం అసాధారణం… అలాంటిది చాలా సింపుల్గా గాల్లోకి ఎగిరి మరి నితీష్ కుమార్ రెడ్డి పట్టుకోవడంతో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఈ క్యాచ్ చాలా వైరల్ అవుతుంది. టీమిండియాకు మరో మంచి ఫీల్డర్ దొరికాడంటూ కామెంట్లు చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ కూడా చాలా అద్భుతంగా ఉందంటూ చాలామంది కొనియాడుతున్నారు. ఇక ఈ టెస్ట్ లో భాగంగా ఇప్పటికే ముగ్గురు ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ మొదటి ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేశారు. కేఎల్ రాహుల్ సెంచరీ కొట్టి అవుట్ అవ్వగా, జూరెల్ 125, రవీంద్ర జడేజా 104 పరుగులు చేశారు. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా 448 పరుగులు చేసింది. ఈ టెస్ట్ లో భాగంగా ఇండియన్ బ్యాట్స్మెన్ట్స్ అలాగే బౌలింగ్ లోను మరోవైపు ఫీల్డింగ్ లోను అదరగొడుతున్నారు.

Read also : ఈఎల్వీ భాస్కర్ ఈవెంట్ ఇందుకోసమేనా…?

Read also : కేవలం నాలుగు రోజుల్లోనే 800 కోట్లు సంపాదన.. మద్యం అమ్మకాలలో రికార్డ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button