పురుగుల అన్నం తిని విద్యార్థుల అస్వ‌స్థ‌త‌

  • ఒక్క మెతుక‌న్నం కూడ‌ప‌డేయ‌వ‌ద్ద‌ని వార్డెన్ క‌ర్క‌శ‌త్వం
  • 108కి కాల్ చేయ‌మ‌న్న ప‌ట్టించుకోని వైనం
  • ఆర్ఎంపీతో వైద్యం

బెల్లంప‌ల్లి,క్రైం మిర్ర‌ర్ః

పురుగుల అన్నం తిని 40 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజ‌న్ తో అస్వ‌స్థ‌కు గురైన ఘ‌ట‌న బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం ప్ర‌భుత్వ ఎస్సీ బాలిక‌ల హాస్ట‌ల్లో చోటు చేసుకుంది.

అన్నంలో పురుగులు వ‌చ్చాయ‌ని తెలిపిన ఒక్క మెతుకు కూడ ప‌డేయ‌వ‌ద్ద‌ని తినాల‌ని వార్డెన్ క‌ర్క‌శ‌త్వంగా ప్ర‌వ‌ర్తించారు.

విద్యార్థులు అన్నం తిన్న వెంట‌నే క‌ళ్లు తిరిగి పోవ‌డం, వాంతులు వ‌చ్చి అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలి పోయారు. ఈ విష‌యంపై 108కి కాల్ చేస్తామ‌ని వేడుకున్న ప‌ట్టంచుకోకుండా సిబ్బంది చూస్తు కూర్చున్నారు.

ఈ విష‌యం బ‌య‌ట‌కు తెలిస్తే ప‌రువు పోతుంద‌ని గ‌మ‌నించి స్థానికంగా ఉండే ఓ ఆర్ఎంపీతో ఇంజ‌క్ష‌న్, టాబ్లెట్స్ ఇప్పించారు.

సాయంత్రం 7.30 గంట‌ల‌కు అస్వ‌స్థ‌కు గురైన‌ట్లు తెలుప‌గా రాత్రి 10 గంట‌ల‌కు హాస్ట‌ల్ వ‌ద్ద‌కు వెళ్లారు. మూడు గంట‌లు న‌ర‌కం అనుభ‌వించామ‌ని విద్యార్థులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button