Friday, March 20, 2026
Homeతెలంగాణఅసెంబ్లీలో పాము కలకలం..భయాందోళనలకు గురైన జర్నలిస్టులు

అసెంబ్లీలో పాము కలకలం..భయాందోళనలకు గురైన జర్నలిస్టులు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో పాము కనిపించడంతో కాసేపు కలకలం రేగింది. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ ఏమాత్రం భయపడకుండా పామును సురక్షితంగా పట్టుకున్నారు.

అసెంబ్లీ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద ఈ పాము కనిపించింది. హఠాత్తుగా పాము ప్రత్యక్షమవడంతో అక్కడున్న సిబ్బంది, జర్నలిస్టులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. కానిస్టేబుల్ చాకచక్యంగా పట్టుకున్న ఆ పామును అటవీ అధికారులకు అప్పగించి, సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments