క్రీడలువైరల్

స్మృతి మందనా బ్యాడ్ లక్.. పెళ్లి వాయిదానే కాదు.. బయటకు వచ్చిన మరో విషయం?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మందనాకు దురదృష్టం వెంటాడుతుంది. ఎందుకంటే తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగాల్సిన టైంలో తన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో నిన్న చాలా ఘనంగా జరగవలసినటువంటి పెళ్లి వాయిదా పడింది. తన ప్రియుడు, స్టార్ మ్యూజిక్ కంపోజర్ పలాసముచ్చల్ తో రెండు రోజులుగా హల్ది వేడుకలు ఘనంగా జరుగుతూ వచ్చాయి. కానీ పెళ్లి సమయానికి ముందు రోజు స్మృతి మందానా తండ్రి శ్రీనివాస్ కు హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే వివాహాన్ని పోస్ట్ ఫోన్ చేసుకుని మళ్లీ తన తండ్రి ఆరోగ్యం కుదుటపడ్డాకే పెళ్లి చేసుకుంటామని స్మృతి మందాన వివరణ ఇచ్చింది. అయితే ఇది ఇలా ఉండగా.. మరోవైపు తన కాబోయే భర్త పలాస్ కూడా అనారోగ్యానికి గురైనట్లు తాజాగా NDTV కీలక ప్రకటన తెలిపింది. వైరల్ ఫీవర్ తో పాటు తనకు ఎసిడిటీ పెరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొంది తాజాగా డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. దీంతో ఎంతో ఘనంగా పెళ్లి జరుగుతున్న క్షణాల్లో ఇలా తండ్రి గారికి అలాగే కాబోయే భర్త ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురవడంతో మృతి మందనా బాగోద్వేగానికి గురయ్యారు.

Read also : మరోసారి ఊపందుకున్న డేటింగ్ ప్రచారం..!

Read also : ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న ఢిల్లీ ప్రజలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button