Monday, March 2, 2026
Homeతెలంగాణస్కూల్ బస్సు, బైక్ డీ...ఇద్దరు యూవకులు మృతి

స్కూల్ బస్సు, బైక్ డీ…ఇద్దరు యూవకులు మృతి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: స్కూల్ బస్సు, బైక్ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ మండలము చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి

నల్గొండ జిల్లా, నల్గొండ మండలము, చందనపల్లి గ్రామం వద్ద ఉదయం 9.00 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ బస్సు,ద్విచక్ర వాహనం ఢీకొని బైక్‌ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.

ప్రమాదంలో మృతులు తుర్కపల్లి (నార్కట్‌పల్లి)కి చెందిన రమేష్ (30), జీ.కొత్తపల్లి (నాగారం)కి చెందిన వంశీ (30) రూరల్ పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాలను నల్గొండ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిపారు.

ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన రూరల్ ఎస్సై సైదా బాబు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments