Homeక్రైమ్వందల కోట్ల కుంభకోణం...10 మంది ఏజెంట్లను అరెస్ట్.!?.

వందల కోట్ల కుంభకోణం…10 మంది ఏజెంట్లను అరెస్ట్.!?.

నల్లగొండ జిల్లాలో అధిక లాభాలు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన భారీ పెట్టుబడి కుంభకోణాన్ని రూరల్ పోలీసులు బయటపెట్టారు. ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలను ఆకట్టుకున్న ఈ ముఠా, మల్టీ లెవల్ మార్కెటింగ్ విధానంలో సభ్యత్వాలు కల్పించి రోజువారీ ఆదాయం, నిర్దిష్ట కాలంలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మబలికింది.

ఈ విధంగా వందల కోట్ల రూపాయలు సేకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇటీవల ఇదే గుంపు కొత్త పేరుతో మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించి, ఇప్పటికే మోసపోయిన బాధితుల నుంచే మరింత పెట్టుబడులు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

నల్లగొండ పట్టణంలో జరిగిన ఒక సమావేశంపై విశ్వసనీయ సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించి, పది మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులు సహా మరికొందరు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మోసం, కుట్ర తదితర కేసులతో పాటు సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కేసు ఛేదనలో పాల్గొన్న పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.

Also Read : Chikkamagaluru Tragedy: ట్రెక్కింగ్ ట్రిప్ ట్రాజెడీ.. మిస్సైన బాలిక శవమై.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు