క్రైమ్ మిర్రర్,వలిగొండ:- యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండల కేంద్రానికి భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి రవి శ్రీవాణి నూతనంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వలిగొండకు వచ్చిన సందర్భంగా వలిగొండ మండల బీసీ సంఘం అధ్యక్షులు సాయిని యాదగిరి వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోళ్ల శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దయ్యాల శ్రీశైలం, తెలంగాణ ఉద్యమకారులు శీలం స్వామి,పబ్బు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ T20 చరిత్రలో ఎక్కువసార్లు డక్ ఔట్ అయిన భారత ఆటగాళ్లు వీళ్లే!
Naa Anvesh Instagram: యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్, ఇదీ అసలు కథ!
