Homeక్రైమ్దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

  • దారుణం: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని..!

  • ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హనుమకొండలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను తండ్రి రాజశేఖర్ (54) మరియు ఆయన కుమార్తె రాజశ్రీ (24) గా గుర్తించారు.

వారు తమ నివాసంలో సజీవ దహనమయ్యారు. రాజశ్రీ భర్త (అల్లుడు) ప్రవీణ్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రవీణ్ వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఘటన అనంతరం ప్రవీణ్ తన పిల్లలతో కలిసి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

మరో విషాద ఘటన…
మరోవైపు, ఇలాంటిదే మరో విషాద ఘటన సంగారెడ్డి జిల్లా జులకల్ గ్రామంలోనూ జరిగింది. అక్కడ ఒక తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల భర్తను కోల్పోయిన మమత అనే మహిళ తీవ్ర మనస్తాపంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments