జాతీయం

ఇరాన్ నుంచి ఢిల్లీకి.. సేఫ్ గా భారత విద్యార్థులు!

Operation Sindhu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో టెహ్రాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ కోసం ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించింది. ఆ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను తిరిగి స్వదేశానికి తీసుకెళ్లేలా మూసివేసిన ఎయిర్ స్పేస్ ను ఓపెన్ చేసింది. ఈ నిర్ణయంతో ఇరాన్ లోని పలు నగరాల్లో చిక్కుకున్న 1000 మంది విద్యార్థులను ‘ఆపరేషన్ సింధు’ పేరుతో ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకువస్తున్నారు. రెండు రోజుల్లో ఈ విద్యార్థులు అంతా భారత్ లోకి అడుగు పెడతారని విదేశాంగ అధికారులు ప్రకటించారు. ఇరాన్ లో ఉంటున్న భారతీయ విద్యార్థులతో వస్తున్న తొలి విమానం ఇప్పటికే ఢిల్లీకి చేరుకుంది. రెండో విమానం ఇవాళ ఉదయం చేరుకోనుంది. మూడో విమానం సాయంత్రంలోగా రానున్నట్లు అధికారులు తెలిపారు.

 భారత్ కోసం ప్రత్యేక మినహాయింపు

ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని అంతర్జాతీయ విమానాలకు ఎయిర్‌ స్పేస్‌ ను ఇరాన్ మూసివేసింది. కానీ, భారత్ కోసం  ప్రత్యేకమైన కారిడార్ ను ఏర్పాటు చేసి, అక్కడి నుంచి భారత విద్యార్థులను తరలించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఇరాన్ లో సుమారు 4000 మంది భారతీయులు ఉంటున్నారు. వారిలో సగం మంది విద్యార్థులు ఉన్నారు. వారందరినీ భారత ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్ ద్వారా ఇండియాకు తీసుకొస్తుంది. ఇప్పటికే 110 మంది భారతీయ విద్యార్థులను ఢిల్లీకి తీసుకొచ్చింది. వీరంతా ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకోవడంతో అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి తీసుకొచ్చింది. మిగతా విద్యార్థులను నేరుగా ఇరాన్ లోని పలు నగరాల నుంచి తీసుకొస్తోంది.

Read Also: పాకిస్తాన్ కు చైనా స్టెల్త్ ఫైటర్స్, భారత్ కు ముప్పు తప్పదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button