Homeతెలంగాణజాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తులకు ఆహ్వానం - డిఇఓ రమేష్ కుమార్

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ దరఖాస్తులకు ఆహ్వానం – డిఇఓ రమేష్ కుమార్

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2025 సంవత్సరానికి అర్హత గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన ఆసక్తి గల ఉపాధ్యాయులు nationalawardstoteachers.education.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నెల 13వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

ఇతర వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి రాజశేఖర్ రావు 6302538858 నెంబర్ ను సంప్రదించొచ్చు లేదా వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చని, రిజిస్ట్రేషన్ చేసిన కాపీని డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.

దమ్ముంటే చర్చకు రారా రేవంత్.. తొడగొట్టిన కేటీఆర్

రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు