తెలంగాణ

శ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఘనంగా

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జక్కిడి రఘువీర్ రెడ్డి

క్రైమ్ మిర్రర్, ఎల్బీనగర్ : హయత్‌నగర్ మండలం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వర్ధా నగర్ కాలనీలో శ్రీశ్రీశ్రీ నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మన్సూరాబాద్ డివిజన్ నేత జక్కిడి రఘువీర్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై, దేవతను దర్శించుకొని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

ఈ వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్సవం ప్రాంత ప్రజల నుంచి విశేష స్పందనను పొందింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button